Breaking: ఏటీఎం డబ్బులు రూ.2.4 కోట్లతో వ్యక్తి పరారీ

by srinivas |
Breaking: ఏటీఎం డబ్బులు రూ.2.4 కోట్లతో వ్యక్తి పరారీ
X

దిశ, వెబ్ డెస్క్: రాజమండ్రిలో హిటాచి సంస్థ కాంట్రాక్టు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించారు. ఏటీఎంలో జమచేయాల్సిన రూ. 2.4 కోట్లతో అశోక్ పరారీ అయ్యారు. సంస్థ ఉద్యోగులను దారి మళ్లించి డబ్బులు ఎత్తుకెళ్లారు. దానవాయిపేట హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి హిటాచి ఏజెన్సీ ఉద్యోగి డబ్బులు డ్రా చేశారు. ఏటీఎంలో నింపాల్సిన సమయంలో డబ్బుతో అశోక్ పారిపోయారు. దీంతో రాజమండ్రి పోలీసులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. మూడేళ్లుగా హిటాచి మేనేజ్ మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్‌గా అశోక్ పని చేస్తున్నారు. మొత్తం 19 ఏటీఎంలలో డబ్బులు ఫిల్లింగ్ చేయాల్సి ఉండగా ఘటన జరిగింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు.



Next Story