అనకాపల్లిలో రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత

by M.Rajitha |
అనకాపల్లిలో రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలోని అనకాపల్లిలో అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనకాపల్లిలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన లారీలో అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల గంజాయి పట్టుబడింది. దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. దీనిని ఒడిషా నుండి ఏపీకి తరలిస్తున్నట్టు నిందితులు తెలియ జేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా.. వారు ఇచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని అరెస్టు చేయనున్నామని జిల్లా ఎస్పీ దీపిక మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని, అనుమానస్పదంగా ఎవరు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Next Story

Most Viewed