- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
బెంగళూరు అల్లర్ల కేసులో నిందితుడుగా ఉన్న సయ్యద్ సాధిక్ అలీని ఎట్టకేలకు కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. సామాజిక మాద్యమాల్లో తమ మతాన్ని కించపరిచేలా ఎమ్మెల్యే శ్రీనివాసమూర్తి అల్లుడు పోస్టులు చేశారనే కారణంతో రాత్రి వేళ కొందరు అల్లరి మూకలు అతని ఇంటిపై దాడులు చేశారు. పెట్రో బాంబులు విసరడంతో ఎమ్మెల్యే ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా, పలుచోట్ల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసలు విచారణ చేపట్టగా.. నాటి నుంచి నిందితుడు సయ్యద్ సాధిక్ అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు.
అయితే, సాధిక్ అలీ బెంగళూరులోని ఓ బ్యాంకులో రికవరీ ఏజెంటుగా పనిచేసేవాడని తేలింది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు నగరంలో NIA అధికారులు 30 చోట్ల తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుడిని అదుపులోకి తీసుకోగా, అతని నుంచి ఎయిర్ గన్, ఆయుధాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.