ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..

by Sumithra |
ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..
X

దిశ, నందిపేట్ : నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో సంవత్సరం క్రితం సుకృత్ అనే యువకుడు ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. అదే గ్రామానికి చెందిన రజిత అనే అమ్మాయిని వివాహం చేసుకొని సంవత్సరం గడిచిన తర్వాత భార్య భర్తలు ఇద్దరి మధ్యలో గొడవలు జరగడంలో మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

వివరాల్లోకెళ్తే సుకృత్ (22) శుక్రవారం సాయంత్రం పోలీస్ స్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులు చికిత్స అందించగా ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మరణించాడు. సుకృత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు.

Advertisement

Next Story

Most Viewed