లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

by Disha Web Desk 15 |
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
X

దిశ, భద్రాచలం : మావోయిస్ట్ పార్టీకి చెందిన మిలీషియా కమాండర్ పొడియం ఇడుమయ్య, డీఏకేఎంఎస్ అధ్యక్షురాలు ఉయకే ముత్యాలక్క శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. పోడియం ఇడుమయ్య అలియాస్​ హరీష్ 2011 సంవత్సరంలో మిలీషియా సభ్యుడిగా చేరాడు. అప్పటి నుండి మిలీషియా సభ్యుడిగా ఉంటూ 2022 సంవత్సరంలో నెమలగూడ ఆర్పీసీకి మిలీషియా కమాండర్ అయ్యాడు. ఉయికే ముత్యాలక్క కిష్టరామ్ ఏరియా కమిటీ నెమలగూడ ఆర్పీసీ డీఏకేఎంఎస్ లో సభ్యురాలిగా చేర్చుకున్నారు. అప్పటి నుండి సభ్యురాలిగా ఉంటూ మావోయిస్ట్ పార్టీ నాయకులు చెప్పిన విధంగా పని చేశారు.



Next Story

Most Viewed