BREAKING: ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ కీలక హామీ

by Disha Web Desk 19 |
BREAKING: ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధాని మోడీ కీలక హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రామమండ్రిలోని వేమగిరిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ఢిల్లీ-ముంబై కారిడార్ లాగే చెన్నై-విశాఖ కారిడార్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి ఎయిర్ పోర్టు, ఏపీ నుండి నిర్మించనున్న చెన్నై-కోల్ కతా హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఇది మోడీ గ్యారెంటీ అని.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కోసం ఎన్డీఏ కూటమికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు హయాంలో ఏపీ అభివృద్ధి చెందదని గుర్తు చేశారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎన్డీఏ కూటమి నేతలకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. జూన్ 4 తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed