- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
దొంగతనానికి వెళ్లి అనంతలోకాలకు..
దిశ, మిడ్జిల్ : సోలార్ పార్ట్ లో విత్ కేబుల్ దొంగతనానికి వెళ్లి మొదటి కంచె దాటి రెండో కంచె దాటే క్రమంలో ఆ కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో దొంగతనానికి వెళ్లిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మిడ్జిల్ మండల పరిధిలోని బోయిన్పల్లి గ్రామంలో గల ప్రగతి సోలార్ ప్లాంట్ లో తరచుగా కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో సోలార్ యజమాన్యం రెండు కంచెలు ఏర్పాటు చేశారు. ఇందులో రెండో కంచెకు కరెంటు పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో దొంగతనానికి వచ్చిన వ్యక్తులు మొదటి కంచె కట్ చేసుకుని లోపలికి వెళ్లి రెండో కంచె కట్ చేసే క్రమంలో కరెంటు సరఫరా ఉండటంతో కింద తడిగా ఉండడం తో విద్యుత్ షాక్కు గురై ఇద్దరు మృత్యువాత పడినట్లు సమాచారం.
ఈ ఘటన విషయం తెలుసుకున్న మిడ్జిల్ ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతి చెందిన వారు గుర్తు తెలియనివారని ,వారి వివరాలు సేకరించేందుకు అన్వేషిస్తున్నామని తెలిపారు. కాగా వీరితో పాటు మరో ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారని వీరిలో ఒక మహిళ ఖాళీ గొలుసు పట్టీలు అక్కడ పడి ఉండడాన్ని గుర్తించారు. ఈ ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో మృతుల వివరాల తో పాటు ఘటన వివరాలు తెలియాల్సి ఉంది.