రాంపూర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ..

by Aamani |
రాంపూర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరీ..
X

దిశ,అల్లాదుర్గం : గుర్తు తెలియని కొంతమంది దుండగులు పెద్దమ్మ తల్లి ఆలయంలోని హుండీ చోరీకి పాల్పడ్డారు.ఈ ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది.161 జాతీయ రహదారి పక్కనే ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని శుక్రవారం నాడు రోజు వారీగానే 7 గంటల సమయంలో పూజారి ఆలయం తలుపులు మూసి ఇంటికి వెళ్ళిపోయారు.శనివారం ఉదయం పూజ కోసం వచ్చిన పూజారి కి అనుమానం వచ్చి చూడగా ఆలయంలోని హుండీ ని పక్క భాగంలో వదిలేయడం చూసి దొంగతనం జరిగినట్లు గా భావించారు. హుండీలోంచి తులం బంగారం,తులం వెండి,నగదు ను అపహరీంచుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed