తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం..

by Aamani |
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం..
X

దిశ, జనగామ: జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జైన ఉమా గౌరి అంగన్‌వాడీ టీచర్ తన అమ్మగారికి ఒంట్లో బాగాలేనందున ఒకటో తేదీ సాయంత్రం 6:30 గంటలకు ఇంటికి తాళం వేసి గిర్నిగడ్డకు వెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం తన ఇంటి పక్కన వారు ఫోన్ చేసి తన ఇంటి తాళం పగిలి ఉందని చెప్పారు. ఇంటికి వచ్చి చూసేసరికి బీరువాలో ఉన్న నల్లపూసల తాడు, 3 జతల ముత్యాల గొలుసు, మొత్తం 35 గ్రా.ల బంగారం, 150 గ్రాముల వెండి. మొత్తం విలువ రూ. 2,28,000/- వరకు ఉంటుందని ,ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి దొంగతనం చేసారని తెలుపగా ఎస్‌ఐ భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed