- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బైక్ను ఢీకొట్టిన టిప్పర్.. తండ్రి కొడుకులు స్పాట్ డెడ్
by Rajesh |
X
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని రామనారాయణ రెడ్డి కాలనీ చౌరస్తా వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి చెందారు. రావి నారాయణ రెడ్డి కాలనీ చౌరస్తా వద్ద బైక్పై వెళ్తున్న తండ్రి కొడుకులను ఎదురుగా వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. దీంతో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తండ్రి కుమార్ (40), కుమారుడు ప్రదీప్ (8) గా పోలీసులు గుర్తించారు. బైక్ ను టిప్పర్ ఢీకొనడంతో మంటలు చెలరేగి కుమారుడు ప్రదీప్ సజీవ దహనమయ్యాడు. ఒక్క సారిగా మంటలు చెలరేగడంతో బైక్ దగ్ధం కాగా లారీ పాక్షిక దగ్ధం అయింది. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Advertisement
Next Story