మద్యం మత్తులో గ్రామ పంచాయతీ ఈఓ వీరంగం..

by Sumithra |
మద్యం మత్తులో గ్రామ పంచాయతీ ఈఓ వీరంగం..
X

దిశ, బాసర : తెల్లవారు జామునే తప్ప తాగి మార్నింగ్ వాకర్స్స్ ను గ్రామ పంచాయతీ ఈఓ ఢీకొన్న సంఘటన బాసరలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే మేజర్ గ్రామ పంచాయతీ ఐన బాసర మండల గ్రామ పంచాయతీ ఈఓ గోవిందా రాజు వేకువజామునే తప్పతాగి ర్యాశ్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన మార్నింగ్ వాకర్స్ లో ఒకరైన విజయరావును కార్ తో ఢీ కొట్టి గాయాలపాలు చేశాడు. అనంతరం ఎటువంటి చింత లేకుండా అలాగే వెళ్ళిపోయి గ్రామ పంచాయతీ ఎదురుగా కార్ పార్కు చేసి మద్యం సేవించి పంచాయతీ కార్యాలయంలోని తన టేబుల్ పై పడుకున్నాడు.

గాయాలపాలైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా పంచాయతీ కార్యాలయానికి చేరుకున్న పోలీసులు ఈఓ గోవింద రాజును విచారించగా కనీసం మాట్లాడటానికైనా రావడం లేదని అక్కడే ఉన్నవారు తెలిపారు. కారులో మద్యం బాటిల్ సైతం లభించడంతో పోలీసులు కేసునమోదు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీని గాడిలో పెట్టివలసిన అధికారి తాగి గ్రామస్తులను కారుతో గాయపర్చడమేమిటని ప్రజలు విడ్డూరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed