గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

by Disha Web Desk 23 |
గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
X

దిశ,తాండూరు : తాండూర్ మండలం చంద్రవంచ గ్రామ సమీపంలోని నదిలో ఓ మహిళ శవం లభ్యమైనట్లు కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా 30 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళ మృతదేహం లభించినట్లు చెప్పారు. ఈ మహిళాకు ఒంటిపైన ఎరుపు రంగు చీర ధరించినట్లు గుర్తించామని చెప్పారు. మహిళ మృతి పట్ల కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు. వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు 8712670052 నెంబర్ కి గాని 8712670051, నెంబర్ కు గాని ఫోన్ ద్వారా తెలియజేయాలని కోరారు.

Next Story

Most Viewed