- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
రాష్ట్రంలో మరో దారుణం..తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి
దిశ,వెబ్డెస్క్:రాష్ట్రంలో వరుసగా మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఏపీలో మరో దారుణ ఘటన జరిగింది. తాజాగా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో ఓ అనాథ బాలికపై అత్యాచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. బాధితురాలు తిరుపతిలోని జువైనల్ హోమ్లో ఉంటుంది. నేర చరిత్ర కలిగిన బాలికలతో పాటు అనాథ బాలికలు ఈ జువైనల్ హోమ్ లో ఉంటున్నారు. ఈ గృహంలో స్థానిక నెహ్రూ మున్సిపల్ స్కూల్లో సదరు బాలిక 9వ తరగతి చదువుతోంది. హాస్టల్కు సరుకులు సరఫరా చేసే నిందితుడు రుషి ఆమెతో పరిచయం ఏర్పరచుకుని అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జరిగిన ఘటనపై వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి, బాలికను వైద్య పరీక్షల కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారమే జరిగిన గోప్యంగా ఉంచడం పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.