Road Accident: మంచిర్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

by Shiva |
Road Accident: మంచిర్యాల జిల్లాలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాసిపేట మండలానికి చెందిన కొమ్ము శివకుమార్ (30) యువకుడు పని నిమిత్తం బెల్లంపల్లి‌కి వెళ్లాడు. ఈ క్రమంల పట్టణంలోని గంగరాంనగర్ వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా కొమ్ము శివ‌కుమార్ వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed