- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
వారికి బంధువుల ఇళ్లే టార్గెట్
by Sridhar Babu |
X
దిశ, మాచారెడ్డి : బంధువుల ఇళ్లే టార్గెట్ చేసుకొని దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గజ్యానాయక్ తండాలో ఈనెల 2న చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్టు మాచారెడ్డి ఎస్ఐ అనిల్ తెలిపారు. తండాలో చైన్ స్నాచింగ్ కు గురైన పందిరి రాజవ్వకు నిందితులు బంధువులు కావడం విశేషం. చైన్ స్నాచింగ్ కేసులో నేరస్తులైన మ్యాడం సంతోష్, గడి ముందటి మానసలను వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నారు. వీరికి అప్పులు ఎక్కువకావడంతో వాటిని తీర్చడానికి వరుసకు మేనత్తయిన రాజవ్వ మెడలో నుండి చెయిన్ దొంగిలించారు. దొంగిలించుకుని వెళ్లిన చైన్ ను విక్రయించడానికి బైక్ పైన వెళ్తుండగా పోలీసులు పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు ఆయన వివరించారు.
Advertisement
Next Story