Pakistan: పాకిస్థాన్‌లో ఘోరం.. 24 మంది టీచర్లపై హెచ్ఎం అత్యాచారం..

by Vinod kumar |
Pakistan: పాకిస్థాన్‌లో ఘోరం.. 24 మంది టీచర్లపై హెచ్ఎం అత్యాచారం..
X

ఇస్లామాబాద్ : ఓ స్కూల్ హెడ్మాస్టర్ కీచకుడిగా మారాడు. కామంతో కళ్లు మూసుకుపోయి టీచర్లతో దారుణంగా ప్రవర్తించాడు. తన స్కూల్‌లో పనిచేస్తున్న 24 మంది ఉపాధ్యాయినులపై రేప్ చేయడమే కాక, వాళ్లను బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ ఘోరం పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న గుల్షన్‌-ఈ-హదీద్‌ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకుంది. ఇర్ఫాన్‌ గఫూర్ మెమూన్‌ అనే హెడ్ మాస్టర్.. ఉద్యోగాలు, ఇతర విషయాల్లో మహిళా టీచర్లను భయపెట్టి తన ఆఫీస్‌లోనే వారిపై రేప్‌లకు పాల్పడే వాడనే అభియోగాలతో కేసులు నమోదయ్యాయి. ఈ రేప్‌లను స్కూల్ సీసీ కెమెరాలతో రికార్డు కూడా చేయించాడని పేర్కొన్నారు.

అతడు చేసిన ఒక అత్యాచారం వీడియో ఇటీవల ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఘోరం వెలుగులోకి వచ్చింది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు.. ఆ స్కూల్‌కు గవర్నమెంట్ పర్మిషన్స్ కూడా లేవని తేల్చారు. ప్రధానోపాధ్యాయుడు ఇర్ఫాన్‌ గఫూర్ మెమూన్‌ ఫోన్‌ను చెక్ చేసిన పోలీసులు.. అందులో ఈ అత్యాచారాల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ‘‘నేను చేసిన పనికి సిగ్గు పడుతున్నాను. కానీ, ఈ వీడియోల్లో పాఠశాల సిబ్బంది ఎవరూ కనిపించడం లేదు’’ అని కీచక హెడ్ మాస్టర్ మీడియాతో చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed