HYD: ఫిల్మ్‌నగర్‌లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు బలి

by GSrikanth |
HYD: ఫిల్మ్‌నగర్‌లో జలమండలి నిర్లక్ష్యానికి ఒకరు బలి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఫిల్మ్‌నగర్‌లో జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి ఒకరు బలయ్యారు. డ్రైనేజీ కోసం జలమండలి అధికారులు తవ్వించిన గుంతలో పడి మంగళవారం ఉదయం ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఇష్టారీతిన గోతులు తవ్వి.. నిర్లక్ష్యంగా వదిలేయడంతో ఒక ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యుడి ఫిర్యాదుతో సంబంధిత కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed