మమతది హత్యే.. దారుణానికి ఒడిగట్టింది ఆమె ప్రియుడే..

by Sumithra |
మమతది హత్యే.. దారుణానికి ఒడిగట్టింది ఆమె ప్రియుడే..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాన్సువాడలో రెండు రోజులు క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ప్రైవేటు హాస్పిటల్ నర్స్ మమతది హత్యేనని పోలీసులు తేల్చేశారు. నమ్మిన ప్రియుడే ఆమెను హతమార్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేసు వివరాలను బాన్సువాడ సీఐ కృష్ణ ఆదివారం మీడియాకు వెల్లడించారు. బీర్కూర్ మండలం బరంగెడ్గికి చెందిన మమత, ప్రశాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని మమత ప్రశాంత్ పై ఒత్తిడి తేవడంతో, ప్రియుడు ప్రశాంత్ ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు.

పథకం ప్రకారం గత గురువారం ఆమె గొంతుకు చున్ని బిగించి హత్య చేశాడు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలివెళ్లాడు. తమ కూతుర్ని హత్య చేశారని మమత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మమతది హత్యేనని, హత్య చేసింది. ప్రశాంతేనని పోలీసులు తమ విచారణలో తేల్చారు. ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed