నిజామాబాద్ లో తొలి హనీ ట్రాప్ కేసు

by Sumithra |
నిజామాబాద్ లో తొలి హనీ ట్రాప్ కేసు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో తొలి హనీ ట్రాప్ కేసు నమోదు చేశారు సైబర్ క్రైం పోలీసులు. నిజామాబాద్ సైబర్ క్రైం డీఎస్పీ వేంకటేశ్వర్ రావు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఒక ప్రైవేట్ ఉద్యోగికి ఒక కొత్త ఫోన్ నంబర్ నుంచి ప్రాంక్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి హస్కీ వాయిస్ తో సదరు ఉద్యోగితో స్నేహం చేశారు. ఫోన్ లోనే సదరు వ్యక్తితో విడియో కాల్ లో మాట్లాడి వాటిని రికార్డు చేసి వాటితోనే బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి వరంగల్ కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ తెలిపారు.

Next Story

Most Viewed