Brutal Murder: సూర్యాపేట జిల్లాలో దారుణం.. గొంతు కోసి యువకుడి దారుణ హత్య

by Kavitha |
Brutal Murder: సూర్యాపేట జిల్లాలో దారుణం.. గొంతు కోసి యువకుడి దారుణ హత్య
X

దిశ, తిరుమలగిరి: తిరుమలగిరి మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన వనగండ్ల కిరణ్ కుమార్ (29) దారుణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే..

వనగండ్ల కిరణ్ కుమార్‌కు దుండగులకు తిరుమలగిరి సాయిబాబా గుడికి వెళ్లే దారిలో తోపులాట గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో అతన్ని హతమార్చి మృతదేహాన్ని నాగారం మండలం డి.కొత్తపల్లి ఎస్సారెస్పీ కాలువ సమీపంలో పడవేసి దుండగులు పరారయ్యారు. ఇక దారి వెంబడి పోయేవాళ్ళు ఈ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. సంకరా స్థలాన్ని పరిశీలించి కిరణ్ కుమార్‌ను గొంతు కోసి దారుణంగా హత్యచేసారని గుర్తించారు. అలాగే సంఘటన స్థలాన్ని, మొదటగా గొడవ జరిగిన ప్రదేశాన్ని పోలీసులు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతుని కారు తాళంచెవి, కొన్ని డబ్బులు తెల్ల కాగితం లభించినట్లు తెలిపారు. ప్రస్తుతం సూర్యాపేట డీఎస్పీ జి రవి మృతుడు ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. కాగా దుండగుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగినట్లు, సంబంధిత ఏరియాలో ఏమైనా సీసీ కెమెరాలు ఉన్నాయా వీడియోలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed