BREAKING: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లోనే ఒకరి దుర్మరణం

by Shiva Kumar |
BREAKING: పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై పల్టీలు కొట్టిన కారు.. స్పాట్‌లోనే ఒకరి దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్లపై నెమ్మదిగా వెళ్లాలంటూ వాహనదారులకు పోలసులు చేసిన సూచనలు బుట్టదాఖలు అవుతున్నాయి. రహాదారుల పక్కన వెంట స్పీడ్ లిమిట్ సూచీ బోర్డులు ఏర్పాటు చేసిన కొంతమంది వాహనదారులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ.. ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై కారు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ అతివేగం, అజాగ్రత్తతో ఓ కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయలు అయ్యాయి. ఈ క్రమంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నడిరోడ్డుపై ఉన్న కారును తొలగించారు. అనంతరం గాయపడిన సమీప ఆసుపత్రికి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed