గాలి వానకు పానగల్లు చెరువులో వ్యక్తి గల్లంతు

by Kalyani |
గాలి వానకు పానగల్లు చెరువులో వ్యక్తి గల్లంతు
X

దిశ,నల్గొండ: నల్గొండ మండలంలోని చందన పల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు పానగల్లు లోని చెరువులోకి చేపల వేటకు వెళ్లారు. ఒక్కసారిగా వచ్చిన గాలి వానకు జేరిపోతుల మహేష్,పెరికె రాము ఒడ్డుకు కొట్టుకొని వచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కొడదల సైదులు చెరువులో గల్లంతు అయ్యారు. కుటుంబ సభ్యులు వెతికే ప్రయత్నం చేయగా చీకటి అలుముకుంది.

Advertisement

Next Story

Most Viewed