ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లపై నిషేధం

by Jakkula Mamatha |
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్లపై నిషేధం
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. పట్టణాల్లోని కీలక ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్‌లు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించాలన్న ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. నెల్లూరు నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. పట్టణ ప్రధాన రహదారి సెంటర్ డివైడర్లలో ఫ్లెక్సీలు, పోస్టర్‌లు ఏర్పాటు చేయకుండా నిషేధం విధిస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చట్టాన్ని చేశాయని చెప్పారు. త్వరలో ఏపీలో కూడా చట్టాన్ని తీసుకువస్తామని వెల్లడించారు. అలాగే పట్టణాల్లోని గోడలకు పోస్టర్‌లు అంటిస్తే వాటిని వెంటనే తొలగిస్తామని చెప్పారు. ప్రచారాలు చేసుకునేందుకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నారాయణ సూచించారు.

Advertisement

Next Story

Most Viewed