75 వేల డబుల్ బెడ్‎రూం ఇళ్లు పంపిణీకి సిద్ధం..!

by  |
75 వేల డబుల్ బెడ్‎రూం ఇళ్లు పంపిణీకి సిద్ధం..!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్:

జీహెచ్ఎంసీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై మల్కాజ్‎గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. బుధవారం ప్రగతి భవన్‎లో జరిగిన ఈ సమావేశంలో అయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరుగుతున్న కార్యక్రమాలపై మంత్రి మల్లారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహాన్‎లతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సుమారు 75 వేల డబుల్ బెడ్‎రూం ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. నగరంలో పుట్‎పాత్‎లు, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే లింక్ రోడ్లు, పార్కుల అభివృద్ధి వంటి కార్యక్రామాలు జీహెచ్ఎంసీకి మంచి పేరు తీసుకొచ్చాయని అన్నారు.


Next Story