తెలంగాణలో కొత్తగా 5,892 పాజిటివ్ కేసులు

by vinod kumar |
corona active cases in telangana district wise
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి కొత్తగా 46 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 4.81 లక్షల కరోనా కేసులు నమోదవగా.. 2,625 మంది మృతి చెందారు. తెలంగాణలో ప్రస్తుతం 73,851 యాక్టివ్ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1104 కరోనా కేసులు నమోదవగా.. రంగారెడ్డి 443, మేడ్చల్‌ 378, నల్గొండ జిల్లాలో 323 కేసులు, వరంగల్‌ అర్బన్‌ 321, కరీంనగర్‌ జిల్లాలో 263 కరోనా కేసులు, నాగర్‌కర్నూలు 204, సిద్దిపేట 201, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 195 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ ప్రమాదకర స్థాయిలో విజృంభిస్తోందని, మొదటి వేవ్ కన్నా.. సెకండ్ చాలా ప్రమాదకరంగా వ్యాప్తిచెందుతోందని అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed