కెనాల్‌లో పడి ఇద్దరు మృతి

by  |
కెనాల్‌లో పడి ఇద్దరు మృతి
X

దిశ, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. చేతులు కడుక్కుందామని కెనాల్ వద్దకు వెళ్లిన ముగ్గురిలో ఇద్దరు ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందారు. ఈ ఘటన కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రేకుర్తి శివార్లలో బుధవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకివెళితే.. ఫ్లంబర్ వృత్తి చేసుకునే ముగ్గురు వ్యక్తులు కెనాల్ వద్దకు వెళ్లారు. చేతులు కడుక్కునేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు కాలువలో పడి దుర్మరణం చెందారు. మృతులు బొమ్మకల్‌కు చెందిన యాకయ్య (48), చింతకుంటకు చెందిన హమీద్ (40)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed