పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

by vinod kumar |
పాకిస్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
X

పాకిస్థాన్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావల్పిండి నుంచి స్కర్దుకు వెళుతున్న బస్సు ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే సైనిక హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలను ప్రారంభించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ప్రమాద ఘటన స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

tags: accident, 23 people died, pakistan

Advertisement

Next Story

Most Viewed