ఏపీలో ఎంతమందికి కరోనా వచ్చిపోయిదంటే !

by  |
ఏపీలో ఎంతమందికి కరోనా వచ్చిపోయిదంటే !
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో 19.7శాతం మందికి కరోనా వచ్చిపోయిందని నిర్ధారించారు. రాష్ర్టవ్యాప్తంగా రెండు దశల్లో సీరో సర్వైలెన్స్​ సర్వే చేసి స్పష్టం చేసింది. పురుషుల్లో 19.5 శాతం, మహిళల్లో 19.9 శాతమని తేలింది. పట్టణాల్లో 22.5శాతం మందికి, గ్రామీణ ప్రాంతాల్లో 18.2 శాతం మందికి కొవిడ్ ​లక్షణాలు కనిపించకుండానే వచ్చి పోయినట్లు తెలిపింది. కంటైన్‌మెంట్‌ జోన్లలో 20.5శాతం, నాన్‌ కంటైన్‌మెంట్‌ జోన్లలో 19.3శాతం మందికి కరోనా సోకినా వాళ్లకు కనీస లక్షణాలు బయటపడలేదని తేల్చారు. కరోనా వచ్చిపోయిన వారిలో 20.3శాతం మంది హైరిస్క్‌లో ఉన్నట్లు నిర్ధారించారు.


Next Story

Most Viewed