యువతి హత్య.. అద్దెకున్న వారు పరార్

by srinivas |
యువతి హత్య.. అద్దెకున్న వారు పరార్
X

దిశ, ఏపీబ్యూరో: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో దారుణం జరిగింది. క్వారీ కెనల్ రోడ్ వద్ద ఓ ఇంట్లో చొరబడ్డ దుండగులు యువతి గొంతు కోసి హత్య చేశారు. అంతేకాకుండా ఆమె తల్లిపై కూడా కత్తులతో దాడి చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు. అయితే హత్య జరగ్గానే యువతి ఇంట్లోనే అద్దెకు ఉండే దంపతులు పరారీ అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేస్తున్నారు.

Next Story

Most Viewed