పవన్ కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి : గ్రంధి శ్రీనివాస్

by srinivas |
Pawan kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రమంత్రిని సన్నాసి అంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రి సన్నాసి అయితే పవన్ కల్యాణ్ సన్నాసిన్నర సన్నాసి అంటూ విమర్శలు గుప్పించారు. ఏలూరులోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

రాజమండ్రిలో కానిస్టేబుల్స్‌ను తిడతాడు.. అనంతపురంలో మా నాన్న కానిస్టేబుల్ అంటాడని ఇదేం వింత ప్రవర్తనో తనకు అర్థం కావడం లేదన్నారు. ప్రస్తుతానికి పవన్ కల్యాణ్‌కు ముగ్గురు భార్యలు అని మాత్రమే అందరికీ తెలుసునని, తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారో అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ హీరోయిన్‌ను గర్భవతి చేసి రూ.5కోట్లు ఇచ్చి అబార్షన్ చేయించాడన్న ప్రచారం కూడా ఉందని చెప్పుకొచ్చారు.

పవన్ కల్యాణ్ రెండు రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమైపోతుందని ధ్వజమెత్తారు. తన అస్థికలు దేశమంతా చిమ్మితే తనలాంటోళ్లు పుడతారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంపై సెటైర్లు వేశారు. పవన్ ఉద్దేశంలో జనసైనికులు, వీరమహిళలు దద్దమ్మలా అంటూ ప్రశ్నించారు. జన సైనికులను పవన్ కల్యాణ్ అసాంఘిక శక్తులుగా మారుస్తున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed