- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హూతీల డ్రోన్లను ధ్వంసం చేసిన అమెరికా దళాలు
దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్ తీరంలో హుతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు డ్రోన్లను అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు కూల్చివేసినట్లు శుక్రవారం ప్రకటించారు. ఇరాన్-మద్దతుగల హుతీ బృందం బుధవారం నుంచి వరుసగా దాడులు చేస్తూనే ఉందని అధికారులు తెలిపారు. బుధవారం మొదటగా నాలుగు డ్రోన్లను ప్రయోగించగా, వాటిని యాంటీ షిప్ క్షిపణిని కూల్చివేశాయి. గురువారం కూడా గల్ఫ్ ఆఫ్ అడెన్లోని లైబీరియా-ఫ్లాగ్డ్ కార్గో షిప్ లక్ష్యంగా చేసుకుని హుతీ బృందం క్షిపణి దాడి చేసింది. ఈ ఘటనలో షిప్కు ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే దీనిపై హుతీ మిలటరీ ప్రతినిధి యాహ్యా సారీ గురువారం X లో వ్యాఖ్యానిస్తూ, మా ఆపరేషన్లో లక్ష్యాలను విజయవంతంగా సాధించాము అని అన్నారు.
యెమెన్ ఎర్ర సముద్ర తీరంలో ఎక్కువ భాగాన్ని నియంత్రించే హుతీలు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి షిప్లపై ఎక్కువగా దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడులు పెరగడం వలన అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు హూతీ తిరుగుబాటుదారులపై ఎదురుదాడికి దిగుతున్నాయి. ఎర్ర సముద్ర తీరంలో రద్దీగా ఉండే వాణిజ్య మార్గాలలో నౌకలపై దాడులను ఎదుర్కోవడానికి పశ్చిమ నావికా దళాలను మోహరించారు.