- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
దిశ, నేషనల్ బ్యూరో: దక్షిణ కొరియా రాజధాని సమీపంలోని లిథియం బ్యాటరీ తయారీ కర్మాగారంలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మరణించగా..నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 15 మంది ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న వెంటనే రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఎనిమిది మృత దేహాలను వెలికి తీసినట్టు స్థానిక అగ్నిమాపక అధికారి కిమ్ జిన్-యంగ్ తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది విదేశీ పౌరులే ఉన్నట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు వెల్లడించలేదు. అయితే బ్యాటరీ సెల్ పేలుళ్ల కారణంగానే మంటలు చెలరేగాయని భావిస్తున్నారు. ఘటనా సమయంలో ఫ్యాక్టరీలో 102 మంది పని చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటన అనంతరం దక్షిణ కొరియా ప్రభుత్వం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని సంబంధిత ప్రభుత్వ సంస్థలు, స్థానిక అధికారులకు అంతర్గత, భద్రత మంత్రి లీ సాంగ్-మిన్ ఆదేశాలు జారీ చేశారు.