సూడాన్ రాజధానిపై డ్రోన్ దాడి.. 40 మంది మృతి

by Vinod kumar |
సూడాన్ రాజధానిపై డ్రోన్ దాడి.. 40 మంది మృతి
X

ఖర్తోమ్ : సూడాన్‌లో అంతర్యుద్ధం ఆగడం లేదు. రాజధాని ఖర్తోమ్‌లోని ఓ మార్కెట్ పై ఆదివారం జరిగిన డ్రోన్ దాడిలో దాదాపు 40 మంది చనిపోయారు. 36 మందికిపైగా గాయపడటంతో, వారిని బషీర్ యూనివర్సిటీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సూడాన్‌లో అధికారం కోసం సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఏప్రిల్ 15 నుంచి అంతర్యుద్ధం నడుస్తోంది. నాటి నుంచి పలుమార్లు ఇలాంటి దాడులు జరిగినా.. ఇంత భారీగా మరణాలు చోటుచేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి.

Advertisement

Next Story

Most Viewed