శిథిలమైన పాఠశాల భవనానికి మరమ్మతులు ప్రారంభం

by Mahesh |
శిథిలమైన పాఠశాల భవనానికి మరమ్మతులు ప్రారంభం
X

దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. గత ఏడాది నుండి భవన మరమ్మత్తులు చేపట్టాలని పదేపదే విద్యార్థులు, ఆ పాఠశాల ఉపాధ్యాయులు అడిగిన ఎవరూ స్పందించలేదు. ఈ క్రమంలో భవనం మరమ్మతులు చేపట్టాలని పలుమార్లు వరుసగా పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. పాఠశాల భవనానికి మరమ్మత్తుల పనులు పది రోజుల్లో పూర్తిగా చేపడతామని ఎంపీడీవో భాస్కర్ అన్నారు. పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. దీంతో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పత్రికల్లో కథనాలు వస్తే తప్ప అధికారులు స్పందించే పరిస్థితి లేకపోలేదని, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed