దారుణం.. గంజాయి బ్యాచ్‌ దాడిలో లోకోపైలట్‌ మృతి

by Mahesh |
దారుణం.. గంజాయి బ్యాచ్‌ దాడిలో లోకోపైలట్‌ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గంజాయి మత్తులో ఉన్న ఓ బ్యాచ్ లోకో పైలట్ పై దాడి చేయగా తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘోరమైన సంఘటన విజయవాడ రైల్వే స్టేషన్ లో గురువారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో లోకో పైలట్‌ అయిన డి. ఎబినేజర్ డ్యూటీ టైమ్ కావడంతో గురువారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో స్టేషన్ కు వస్తున్నాడు. ఈ క్రమంలో విజయవాడ స్టేషన్‌లోని నైజాం గేట్ సమీపంలో రైల్వే రోడ్ నెంబర్ 11లో లోకో పైలట్ వెనుక నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఓ ఆగంతకుడు ఇనుప కడ్డీతో బలంగా తలపై కొట్టాడు. దీంతో లోకోపైలట్ కిందపడిపోవడంతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తెల్లవారుజామున కావడంతో ఎవరు గమనించలేదు. దీంతో తీవ్రగాయాలైన లోకో పైలట్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆదారాలను సేకరించి..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా గతంలో చాలాసార్లు దాడి చేశారని.. రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని రైల్వే సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed