కారుతో సహా ఇంట్లోకి దూసుకెళ్లిన స్మగ్లర్లు.. పోలీసుల చేతికి వందల ప్యాకెట్ల గంజాయి

by karthikeya |
కారుతో సహా ఇంట్లోకి దూసుకెళ్లిన స్మగ్లర్లు.. పోలీసుల చేతికి వందల ప్యాకెట్ల గంజాయి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరులో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో గంజాయి తరలిస్తున్న నిందితులను ఛేజ్ చేసిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినా దుండగులు పారిపోవడంతో కారును, గంజాయినా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి స్మగ్లింగ్ జరుగుతోందనే సమాచారం అందడంతో పోలీసులు పాడేరు చింతల వీధిలో తనిఖీలు ప్రారంభించారు. అదే సమయంలో గంజాయితో కారులో ప్రయాణిస్తూ అటుగా వచ్చిన స్మగ్లర్లు.. పోలీసులను చూసి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించడంతో కంగారులో అదుపుతప్పి కారుతో సహా ఓ ఇంట్లోకి దూసుకెళ్లారు. అనంతరం కారు వదిలి స్మగ్లర్లు పరారయ్యారు. కారును సీజ్ చేసిన పోలీసులు.. అందులో నుంచి 500 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెలల్డించారు.

Advertisement

Next Story

Most Viewed