భారత మహిళా క్రికెటర్ కు కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2021-03-29 23:44:14.0  )
భారత మహిళా క్రికెటర్ కు కరోనా పాజిటివ్
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా కట్టలు తెంచుకుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులను సైతం ఈ కరోనా పట్టి పీడిస్తుంది. ఇప్పటీకే క్రీడా దిగ్గజాలైన స‌చిన్ టెండూల్క‌ర్, బ‌ద్రీనాథ్‌, యూసుఫ్ ప‌ఠాన్‌ ,ఇర్ఫాన్ ప‌ఠాన్‌ లకు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన విష‌యం తెలిసిందే.ఇక తాజాగా మరో భారత మహిళా క్రికెటర్ కరోనా బారిన పడ్డారు. ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉండడంతో వైద్యుల సలహా నిమిత్తం హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. గత నాలుగు రోజులుగా జ్వరంతో భాదపడుతున్న కౌర్ ఇటీవలే కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని తేలింది.

Advertisement

Next Story