తల్లి కొడుకుల అనుమానస్పద మృతి..

by Aamani |
తల్లి కొడుకుల అనుమానస్పద మృతి..
X

దిశ,ఖానాపురం: ఖానాపురం మండలం బుధరావుపేట్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. తల్లి కొడుకులు అనుమానస్పదంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఖానాపురం మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన గిరగాని విజయ- శ్రీను దంపతులు వ్యవసాయ కార్మికులు. వీరి కొడుకు విక్రమ్ నర్సంపేట లోని ఓ పెట్రోల్ బంకులో జాబ్ చేస్తున్నాడు. కాగా శనివారం సాయంత్రం తల్లి కొడుకులు అకస్మాత్తుగా విగతజీవులయ్యారు.దీనికి గల కారణం పిడుగుపాటు లేదా మరేదైనా కారణమా అనేది ప్రస్తుతం సందేహంగా ఉంది.

గ్రామంలో కొందరు పిడుగుపాటుకు గురై చనిపోయాడని అనుకుంటుండగా మరి కొందరు ఇతర సందేహాలు వెలిబుచ్చినట్లు సమాచారం. శనివారం సాయంత్రం వర్షం పడడంతో పిడుగుపాటే కావచ్చని మెజారిటీ అభిప్రాయం ఉంది. తల్లి ఇంటి ముందు నిర్జీవమై ఉండగా ..కొడుకు ఇంటి లోపల మరణించి ఉన్నాడు. తల్లీ కొడుకులు ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. పక్కింటి వారు బయట పడిపోయిన తల్లిని చూడడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇది ప్రకృతి విపత్తు..? లేక ఆత్మహత్యనా ..? మరేదైనా కారణమా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed