కరోనాను గెలిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అంతలోనే

by vinod kumar |   ( Updated:2021-05-12 23:53:18.0  )
కరోనాను గెలిచి పండంటి బిడ్డకు జన్మనిచ్చి.. అంతలోనే
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలను కరోనా అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు ప్రజలలో భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చిన్నా, పెద్దా.. ముసలం, ముతక అనే బేధం లేకుండా కరోనా కాటుకు ఎంతోమంది బలవుతున్నారు. ఇక తమ ఆత్మీయుల మరణ వార్త విన్న వారి గుండెలు కూడా మిగిలిపోతున్నాయి. తల్లిదండ్రుల మరణ వార్త విని బిడ్డలు.. బిడ్డల మృతిని తట్టుకోలేని తల్లిదండ్రులు అక్కడిక్కడే ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా కన్న తల్లి మరణవార్త విని ఒక బాలింత మృతి చెందిన విషాద ఘటన విజయవాడ లో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని సింగ్ నగర్ కుచెందిన వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు.వీరి చిన్న కుమార్తె ప్రమీలా.. తాను పనిచేసే బ్యాంకులోనే సహోద్యోగి అయిన గణేష్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. ఆమె గర్భిణి కావడంతో మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. అయితే ఇటీవలే ఆమె కుటుంబమంతా కరోనా బారిన పడ్డారు. ప్రమీల కరోనా బారిన పడిన పండంటి బిడ్డకు జన్మనిచ్చి కరొనను జయించింది. ఐఐటీ ప్రమీల తల్లి రమాదేవి కరోనా తో రెండు రోజుల క్రితం మృతిచెందింది. బాలింతగా ఉన్న ప్రమీలకు ఈ విషయం చెప్పడం మంచిది కాదనుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు తెలియకుండానే తల్లి అంత్యక్రియలు జరిపించేశారు.

అయితే ఇటీవలే ఇంటికి వచ్చిన ప్రమీల తల్లి మరణ వార్త విని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కరోనాను జయించినా.. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఆ కూతురు గుండె ఆగింది.. రెండు వారాల పసికందుకి తల్లి దూరమయ్యింది. ఈ ఘటనలతో ఆ ఇంట విషాదం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed