ఎంజీఎం డాక్టర్లకు వాకిటాకీలు..

by Shyam |
ఎంజీఎం డాక్టర్లకు వాకిటాకీలు..
X

దిశ‌, పోచమ్మ మైదాన్ : రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు వరంగల్ ఎంజీఎంలో వార్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ వి. చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైద్యులు, సిబ్బందిలో భయాన్ని పోగొట్టేందుకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెప్పారు.

ఎంజీఎంలో ఏ ఒక్కరూ చనిపోకుండా వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. ఆస్పత్రిలో డాక్టర్లు, వైద్య సిబ్బంది మధ్య సమన్వయం లోపం ఉందన్నారు. దాన్ని నివారించేందుకు డాక్టర్లకు వాకిటాకీలు ఇస్తామన్నారు. అందరినీ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చూస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న లోపాలను రిపీట్ కానివ్వబోనని చంద్రశేఖర్ వెల్లడించారు.

Next Story

Most Viewed