దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

by vinod kumar |
carona 1
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బుటిటెన్ ప్రకారం .. గడిచిన 24 గంటల్లో దేశంలో 41,831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,55,824 చేరింది. ఇక నిన్న ఒక్కరోజే కరోనాతో 541మంది మరణించగా అదే సమయంలో 39,258 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక దేశంలో ఇప్పటివరకు3,08,20,521 మంది కరోనాను జయించగా, మరణాల సంఖ్య4,24,351కు పెరిగింది. ఇక దేశంలో ప్రస్తుతం4,10,952 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed