రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి

by  |
road accident
X

దిశ,వెబ్ డెస్క్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఆర్టీసీ ఉద్యోగులు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం ములుగు జిల్లా పందికుంట క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. మృతిచెందిన వ్యక్తులు నర్సంపేట డిపో కంట్రోలర్ సదానందం, కండక్టర్ సునీతగా గుర్తించారు. రోజువారి విధుల్లో భాగంగా సదానందం, సునీతలు ఆదివారం తెల్లవారుజామున నర్సంపేట డిపోకు బయలు దేరారు. అయితే వీరు ప్రయాణిస్తున్న బైక్ను డీసీఎం వాహనం ఢీ కొంది. దీంతో సదానందం , సునీత మృతి చెందారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఈ ఘటన పై కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలిపారు.

Next Story