Ayodhya: అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక.. కేజీ బంగారం, వెండితో ధనస్సు

by Shiva |
Ayodhya: అయోధ్య బాల రాముడికి అరుదైన కానుక.. కేజీ బంగారం, వెండితో ధనస్సు
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య బాల రాముడికి కానుకల పర్వం ఆగడం లేదు.విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన నాటి నుంచి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు స్వామి వారికి విలువైన కానుకలు పంపుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరానికి చెందిన రామ భక్తుడు చల్లా శ్రీనివాస రావు భక్తుల సహకారంతో 13 కిలోల వెండి, కేజీ బంగారంతో ధనస్సును తయారు చేయించాడు. ఈ మేరకు ఆయన బుధవారం ఆ ధనస్సుకు భద్రాచల ఆలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ధనస్సును అయోధ్య బాల రాముడికి బహూకరించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed