ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

by srinivas |
Transfer of IAS and IPS
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్‌ఏ అప్పీల్ డైరెక్టర్‌గా ఉన్న ఇంతియాజ్‌ను అదనపు బాధ్యతలు నుంచి రిలీవ్ చేసింది. ఇంతియాజ్ అహ్మద్‌ను సెర్ప్ సీఈఓగా బదిలీ చేసింది. అయితే సెర్ప్ సిఈవోగా ఉన్న రాజబాబును చిత్తూరు జేసిగా బదిలీ చేసింది.

స్వప్నిల్ దినకర్‌ను కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గంధం చంద్రుడు..శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్, పశ్చిమగోదావరి జిల్లా జేసిగా బీఆర్ అంబేడ్కర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed