పాత బస్తీలో  స్నేహితున్నే కడతేర్చిన కసాయి మూకలు

by Sumithra |
murder
X

దిశ, చార్మినార్​: అరువుగా తీసుకున్న డబ్బులు ఇస్తానని స్నేహితున్ని ఇంటికి పిలిచి అతికిరాతకంగా కత్తులతో హతమార్చిన తప్పించుకుతిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను కాలాపత్తర్​ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. ఘాజీబండకు చెందిన అబ్దుల్​ సిద్దిక్​(38) వద్ద నుంచి గత కొంత కాలం క్రితం వ్యాపార నిమిత్తం కాలాపత్తర్​ కు చెందిన సాదిక్​ బిన్​ ఆలీ యమాని 8లక్షల రూపాయలు, హ్యాండ్​లోన్​ కింద కాలాపత్తర్​ కు చెందిన సులేమాన్​ఖాన్​, షాలిబండాకు చెందిన మహ్మద్​ సలీంఖురేషిలు 10వేల రూపాయలను అరువుగా తీసుకున్నారు.

తీసుకున్న డబ్బులు చెల్లించడంలో జాప్యం చేస్తున్న సాదిక్​ బిన్​ ఆలీ యమాని, సులేమాన్​ఖాన్, మహ్మద్​ సలీంఖురేషిలను తన డబ్బులు తనకు ఇవ్వాలని అబ్దుల్​ సిద్దిక్​ తీవ్ర ఒత్తిడి చేయసాగాడు. ఈ నేపధ్యంలో డబ్బుల విషయం మాట్లాడుదామని అబ్దుల్​ సిద్దిక్ ను సాదిక్​ బిన్​ ఆలీ యమాని ఇంటికి పిలిచాడు. ఈ నెల 23వ తేదీన తెల్లవారుజామున ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సులేమాన్​ఖాన్, మహ్మద్​ సలీంఖురేషిలతో కలిసి సాదిక్​ బిన్​ ఆలీ యమాని ఇంటికి వచ్చిన అబ్దుల్​ సిద్దిక్ పై​ కొడవలి, ఇనుప రాడ్లతో దాడి చేసి హత్య చేశారు. మృతుని సోదరుడు అబ్దుల్​ వహీద్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాలాపత్తర్​ పోలీసులు కేసును నమోదు చేసుకుని అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న సాదిక్​ బిన్​ ఆలీ యమాని, సులేమాన్​ఖాన్, మహ్మద్​ సలీంఖురేషిలను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు. ఈ కేసును కాలాపత్తర్​ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed