ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

by  |
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం సాయంత్రం తాళ్లరేవు బైపాస్‌రోడ్డులో ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులను కాకినాడ శారదాదేవి టెంపుల్ భానుగుడికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఇద్దరు అంధులు కాగా, మరొకరు ఆటో డ్రైవర్ ఆరెళ్ల వెంకటేశ్ (17). ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. రోడ్డుప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తున్నారు.


Next Story

Most Viewed