బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు

by Shamantha N |
బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదుల కాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గాం జిల్లా వైకే పొరాలో గురువారం సాయంత్రం కారులో వెళ్తున్న ముగ్గురు బీజేపీ కార్యకర్తలపై ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను ఫిదా హుస్సేన్, ఉమర్ రషీద్, ఉమర్ రంజాన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.

Advertisement

Next Story

Most Viewed