దుక్కి దున్నుతూ బావిలో పడ్డ ట్రాక్టర్.. వ్యక్తి మృతి

by Sumithra |   ( Updated:2021-08-02 01:29:28.0  )
crime news
X

దిశ, నర్సంపేట : దుక్కి దున్నుతూ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావిలో పడిన సంఘటన నెక్కొండ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ రజినీకాంత్ (32) నెక్కొండ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పనులు చేయడానికి ఆదివారం వెళ్ళాడు. ట్రాక్టర్ సాయంతో దుక్కి దున్నుతుండగా అదుపు తప్పి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో ట్రాక్టర్ పడింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

ఆదివారం సాయంత్రం నుండి సహాయక చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం రజినీకాంత్ మృతదేహాన్ని వెలికితీశారు. చంద్రయ్యపల్లి గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ గా పని చేస్తున్న మృతుడు రజినీకాంత్ కి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒకరు కుమారుడు ఉన్నారు. రజనీకాంత్ మృతితో చంద్రయ్యపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed