రుద్రారంలో ఆలయం హుండీ లెక్కింపు..!

by  |
రుద్రారంలో ఆలయం హుండీ లెక్కింపు..!
X

దిశ, పటాన్‌చెరు:

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండల పరిధిలోని రుద్రారంలో స్వయంభుగా వెలసిన గణేష్ గడ్డ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది. దేవాదాయ శాఖ, సంగారెడ్డి డివిజన్ ఇన్‎స్పెక్టర్ ఇందిరా పర్యవేక్షణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మల్లికార్జున్, ఈశ్వర్, అర్చకులు, తదితరులు పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవాలతో కలిపి హుండీ ఆదాయం రూ. 6,16,721 వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఆలయ ఈవో మోహన్ రెడ్డిలు తెలిపారు.


Next Story

Most Viewed