డబ్బుల్లేక నా కూతురితో బస్‌స్టాప్‌లో కూర్చున్న.. స్టార్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్

by Kavitha |   ( Updated:2024-10-16 15:44:40.0  )
డబ్బుల్లేక నా కూతురితో బస్‌స్టాప్‌లో కూర్చున్న.. స్టార్ యాంకర్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్, నటి అయిన ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కెరీర్ తొలినాళ్లలో యాంకర్‌గా లైఫ్ స్టార్ట్ చేసింది ఈ భామ. అప్పట్లో తన యాంకరింగ్‌తో ఓ ఊపు ఊపేసింది. ఇప్పుడంటే రష్మీ, అనసూయ, శ్రీముఖి వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ, అప్పట్లో యాంకర్ అంటే మాత్రం మొదటగా వినిపించే పేరు ఝాన్సీ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలా దూసుకుపోయిన ఈ బ్యూటీ సినిమాల్లో కూడా అవకాశాలను అందుకుంది. రీసెంట్‌గా వచ్చిన 'సలార్' మూవీలో కీరోల్‌లో నటించి మెప్పించింది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ.. కెరీర్‌లో పర్సనల్ లైఫ్ వల్ల చాలా దెబ్బతిన్నానంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “జోగి నాయుడుతో నేను హ్యాపీగా లేని టైం లో చాలామంది మిమ్మల్ని కలపడానికి ట్రై చేశారు. బట్ నేను ఎవరి మాట వినలేదు. సమాజం ఏమనుకున్నా నాకు అనవసరం, నేను సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. మా ఇద్దరికి పుట్టిన కుమార్తె ధన్య నా వద్దే ఉంటోంది. ఒకానొక సమయంలో నేను డబ్బులు లేక బస్ స్టాప్‌లో నా కూతురిని పట్టుకుని కూర్చోవాల్సి వచ్చింది.

కాబట్టి అలాంటి సిట్యువేషన్ రాకుండా అమ్మాయిలందరూ ఫైనాన్షియల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలని.. స్ట్రాంగ్‌గా ఉంటేనే బాగా పోరాటం చేయగలము” అని యాంకర్ ఝాన్సీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా యాక్టర్ జోగినాయుడిని ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల విడాకులు తీసుకొని విడిపోయారు.

Advertisement

Next Story

Most Viewed